ఆధునిక మహాభారతం -
గుంటూరు శేషేంద్ర శర్మ గారు రచించిన ఒక పుస్తకం.
ఈ పుస్తకం లో ఉన్న కవితలు మన మీద మనకే ఒక యుద్దాన్ని ప్రకటిస్తాయి,
అవి చదువుతున్నప్పుడు, కొన్ని వేల మంది శత్రు సైనికులు ఎదురుగా వస్తున్నప్పుడు వాళ్ళకు ఎదురు నిలబడిన ఒక సైనికుడు మాదిరి మనకు అన్పిస్తోంది.మనల్ని అంతా బాగా తనలో కలుపేసుకునే ఒక మంచి పుస్తకం.
" నా దేశం నా ప్రజలు " అనే రెండు వ్యాఖ్యలు తో మొదలవుతుంది ఆధునిక మహాభారతం.
ప్రజా పర్వము,
సూర్య పర్వము,
పశు పర్వము,
ప్రవాహ పర్వము,
ఆద్మీ పర్వము,
ప్రేమ పర్వము,
సముద్ర పర్వము,
జోత్స్నా పర్వము,
మౌక్తిక పర్వము,
మయురా పర్వము లాగా విభిజించబడి కవితాలు ప్రచురితమైనవి.
వాటి నుండి కొన్ని కవితలు…..
chintapalli.sivasanthosh@gmail.com











1 Comments
కవిర్విశ్వో మహాతేజా
ReplyDeleteగుంటూరు శేషేంద్ర శర్మ
Seshendra : Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com
సౌందర్యమే ఆయనకు అలంకారం,సౌందర్యమే ఆయనకు జీవితం
విమర్శకుడు : కవి
ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడు. మంచివక్త, వ్యాసం, విమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనాస్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ..........
- ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)
* * *
పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరితాలూకా నాగరాజుపాడు.
భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీఅకాడమీ అవార్డు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవడాక్టరేటు ముఖ్య పురస్కారాలు.
గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లాకాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోమున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.
నాదేశం - నాప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాల రేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.
కవిత్వంలో, సాహిత్యవిమర్శలో విలక్షుణులు.
ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషల్లో పండితులు,
వచన కవిత్వం, పద్య రచన – రెండిరటి సమాన ప్రతిభావంతులు,
ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
బహిరంతర ప్రకృతులకు తమ రచనల ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
ఒకానొకశైలీనిర్మాత.
- యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం)
అ.జో. - వి. భొ. ప్రచురణలు 1999
Seshendra : Visionary Poet of the Millennium
seshendrasharma.weebly.com